న్యూఢిల్లి : పంజాబ్లో గ్రెనేడ్ పేలుడు ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్సింగ్తో తాను మాట్లాడానని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఘటన గురించి అమరీందర్ తనకు వివరించారని ఆయన అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అమృత్సర్లోని నిరంకారీ భవన్లో ప్రార్థనలు చేస్తున్న వారిపై దుండగులు గ్రెనేడ్తో జరిపిన దాడిలో ముగ్గురు మరణించగా, 20 మంది గాయపడ్డారు.