నరసరావుపేట : వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏపీ లో తెలుగుదేశం ఎంపీలు ఎక్కువ మంది విజయం సాధిస్తే చంద్రబాబే ప్రధాని అవుతారని తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరాలు అన్నారు. ఈ రోజిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తాను నరసరావు పేట నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీని గద్దె దించేందుకు చంద్రబాబు బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో రాయపాటి చంద్రబాబే తదుపరి సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.