చండీగఢ్ : పంజాబ్లో అమృత్సర్లోని నిరంకారీ భవన్పై గ్రెనేడ్తో దాడి చేసిన వారి ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల రూపాయిల రివార్డు ఇస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ ప్రకటించారు. దాడికి పాల్పడిన వారికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలిస్తే పోలీస్ హెల్ప్లైన్ నెంబర్ 181కి సమాచారం అందించవచ్చునని అధికారులు పేర్కొన్నారు. నిరంకారి భవన్లో మతపరమైన ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మోటార్ సైకిల్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు గ్రెనేడ్ విసిరి పారిపోయారు. ఈ ఘటనలో ప్రార్థనలు చేయిస్తున్న మత పెద్దతో సహా ముగ్గురు మరణించగా, 20 మంది గాయపడ్డారు.