ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగు టెస్టుల సిరీస్‌‌ని గెలుచుకోగల సత్తా ఆస్ట్రేలియాకి ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 19, 2018, 02:35 PM

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ప్రస్తుతం జట్టులో లేకపోయినా.. ఆసీస్ పర్యటనలో భారత్‌ జట్టుకి క్లీన్‌స్వీప్ తప్పదని ఆ దేశ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. ఈనెల 21 నుంచి టీమిండియా మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని కంగారూలతో ఆడనుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే అక్కడికే చేరుకున్న భారత్ జట్టు.. బ్రిస్బేన్ వేదికగా బుధవారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. బాల్ టాంపరింగ్ కారణంగా స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం వేటు పడగా.. భారత్‌తో పోలిస్తే ఇప్పుడు ఆస్ట్రేలియా టీమ్ బలహీనంగా కనిపిస్తోంది. కానీ.. నాలుగు టెస్టుల సిరీస్‌‌ని 4-0తో గెలుచుకోగల సత్తా ఆస్ట్రేలియాకి ఉందని మెక్‌గ్రాత్ చెప్పుకొచ్చాడు. 


‘ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్ స్థానాలు భర్తీ చేయడం చాలా కష్టం. కానీ.. యువ క్రికెటర్లకి ఇదే మంచి అవకాశం. భారత్‌పై సిరీస్‌లో అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లకి.. ఇక ఆస్ట్రేలియా జట్టులో తిరుగుండదు. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోటీ కావడంతో సిరీస్ ఆసక్తికరంగా జరగనుంది. అయితే.. టెస్టు సిరీస్‌ని 4-0తో చేజిక్కించుకోగల సత్తా ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టుకి ఉంది’ అని మెక్‌గ్రాత్ ధీమా వ్యక్తం చేశాడు. సుదీర్ఘకాలంగా ఆస్ట్రేలియాలో పర్యటనిస్తున్న భారత్ జట్టు ఇప్పటి వరకూ కనీసం ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా ఆ గడ్డపై గెలవలేకపోయింది. దీంతో.. కనీసం ఈ పర్యటనలోనైనా సిరీస్ గెలవాలని భారత్ పట్టుదలతో ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com