న్యూఢిల్లి : మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 101వ జయంతిని పురస్కరించుకుని పలువురు నేతలు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీకి నివాళులని ప్రధాని నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ఇందిరగాంధీ కోడలు సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్ట్రపతి మొహ్మద్ హమీద్ అన్సారీ ఇక్కడి శక్తిస్థల్ సందర్శించి ఇందిరాగాంధీకి నివాళులర్పించారు.