మిజోరం ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచారం వేడెక్కుతోంది. కాంగ్రెస్ నాయకుడు, ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లా తమ పార్టీలో చేరుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జెవి హుల్నా ప్రకటించారు. అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. అనేకమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి ఉత్సుకత చూపుతున్నారని హుల్నా అన్నారు. మిజోరంలో బిజెపి ఇప్పటి వరకూ ఎన్నడూ ఒక్క సీటు కూడా గెలవలేదు.