అంబాజీపేట: దేశంలో నాలుగు దశాబ్దాల క్రితమే ఎన్నో సంస్కరణలు చేపట్టి భారతీయ ఉక్కు మహిళ గా పేరుపొందిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన సేవలు ఆదర్శనీయమని పీసీసీ కార్యదర్శి మహమ్మద్ ఆరీఫ్ అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 101 వ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఇందిర విగ్రహం కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జాతీయ బ్యాంకుల జాతీయకరణ,20 సూత్రాల ఆర్ధిక పధకాలు, గరీబీ హటావో నినాదం తో దేశాన్ని ప్రగతి పథంలో పంయనింప చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు,ములపర్తి మోహన్ రావు , మాచవరపు శివ నారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు నెల్లి వెంకటరమణ , ఉందుర్తి నాగబాబు,గోగి శ్రీరామూర్తి, పంచాయతీ కార్యదర్శి ఎస్.బి.శర్మ తదితరులు పాల్గొన్నారు.