అమరావతి : సిబిఐలోని అధికారులు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడంతో సంస్థ అప్రదిష్టపాలైందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్జేడీ అధినేత లాలూను అన్యాయంగా ఐఆర్సిటిసి కుంభకోణంలో ఇరికించారని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సిబిఐ ప్రత్యేక డైరెక్టర్గా నియమితుడైన ఆస్థానా కుమ్మక్కై లాలూను ఇరికించారని ఆయన అన్నారు. సివిసికి ఆలోక్ వర్మ వాంగ్మూలం కంటే ఆధారాలు ఏం కావాలని ఆయన అన్నారు. రాష్ట్రాలకు సార్వభౌమాధికారం లేదని జైట్లీ అనడం సబబు కాదని యనమల అన్నారు. రాఫెల్ డీల్ అంశంపై కాగ్ నివేదికను పార్లమెంటులో ఎందుకు పెట్టలేదని మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు వద్ద రహస్యాలు ఎందుకు దాస్తున్నారని ఆయన అన్నారు.