తెలుగు హీరో, విక్టరీ వెంకటేష్ సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారు జామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వెంకటేష్ కు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన వెంకటేష్ తో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పలువురు భక్తులు, అభిమానులు ఉత్సాహం చూపారు.