ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉన్నత విద్యావ్యవస్థను పునఃనిర్మించాలని ఉపరాష్ట్రపతి పిలుపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 18, 2018, 04:55 PM

ఉన్నత విద్యావ్యవస్థను పునఃనిర్మించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. 21 వ శతాబ్దపు అవసరాల మేరకు దేశంలో విద్యావ్యవస్థను పునఃనిర్మించాలని..ప్రతి విద్యార్థిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని.. క్రియాలాంటి విద్యాసంస్థలు అంతర్జాతీయ స్థాయిలో వేగంగా పురోగతి సాధిస్తున్నాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో సమన్వయం అవసరమని.. ప్రభుత్వం సౌకర్యాలను కల్పించే బాలబైన పాత్ర పోషించాలని.. ఇతరులు ప్రభుత్వ కార్యక్రమాలలో పాలుపంచుకోవాలన్నారు. ఆవిష్కరణలు లేకున్నా అభివృద్ధిలో ముందుకు సాగలేమన్నారు. కోపం, నిరాశ, వివక్ష వంటి వాటికి విశ్వవిద్యాలయాలలో స్థానం ఉండకూడదన్నారు. వర్శిటీలు, జ్ఙానం, వివేకం, విజ్ఞానం అందించేవిగా ఉండాలని.. ప్రపంచ అత్యుత్తమ వర్సిటీలతో పోలిస్తే దేశంలో ఉన్నత విద్యావ్యవస్థ వెనుకబడి ఉందని 2022 నాటికి దేశంలో 700 మిలియన్ల నిపుణులకు డిమాండ్ ఉందన్నారు. ఇందుకోసం యువత, విద్యార్థులలో నైపుణ్యం పెంపొందించాలని.. ఈమేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com