నెల్లూరు : దేశంలో తెదేపాకు ఉన్న సైన్యం ఏపార్టీకి లేదని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని 53,54 డివిజన్లలో తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మంత్రితో పాటు మేయర్ అజీజ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… చేస్తున్నారన్నారు. పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికీ జీవిత బీమా సౌకర్యం కల్పించారన్నారు. కార్యకర్త మరణిస్తే వారి పిల్లలకు ఎన్టీఆర్ ఆదర్శ పాఠశాలలో విద్య అందిస్తున్నారన్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరుపున ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. కోడి కత్తి నాటకం వికటించడంతో జగన్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబే అని నారాయణ అన్నారు.