ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలమనేరు నియోజకవర్గంలో మంత్రి అమర్ నాథ్ రెడ్డి పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 18, 2018, 02:06 PM

చిత్తూరు : పలమనేరు నియోజకవర్గంలో  రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డి పర్యటించారు. పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం, మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి  రూ.35 లక్షల తో నిర్మించే బిసి భవనానికి భూమి పూజ చేశారు.  మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ ఆవరణలో రూ. 3 లక్షల జడ్పీ నిదులతో ఏర్పాటు చేసిన సిసిరోడ్లును ఆయన ప్రారంభించారు.  పెద్ద పంజాని మండలానికి చెందిన 6 మంది రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా రైతు రథం పథకం ద్వారా ట్రాక్టరులను రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి యన్.అమరనాద్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు డా. యన్ .శివ ప్రసాద్ లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com