కడప: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కడపలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు నేతృత్వంలో డిసెంబర్ 2న ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు బడ్జెట్లో నిధులను కేటాయించాలన్నారు. చింతమనేని ప్రభాకర్ను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. జగన్పై దాడి ఘటన విచారణలో విచారణను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.