ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ మానసిక వ్యాధితో మాట్లాడుతున్నారు: దేవినేని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 18, 2018, 01:19 PM

విజయవాడ: జగన్‌ మానసిక వ్యాధితో మాట్లాడుతున్నారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్‌పై ఫైర్‌ అయ్యారు. జగన్‌పై దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. దాడి జరిగిన వెంటనే జగన్‌ పోలీసులకు సహకరించలేదన్నారు. 23 రోజుల తర్వాత వచ్చి థర్డ్‌ పార్టీ విచారణ జరపాలనడం దారుణమన్నారు. ఆంధ్ర పోలీసుల మీద జగన్‌ను నమ్మకం లేదని విమర్శించారు. రాజధాని శంకుస్థాపనకు రాలేదు… అసెంబ్లికి రారు, జీతాలు మాత్రం కావాలని ఎద్దేవా చేశారు. బాధ్యతలను విస్మరించి జగన్‌ మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. జగన్‌ కోడి కత్తి నాటకం తొందరలోనే బయటపడుతుందన్నారు. జగన్‌ అవినీతిలో కూరుకుపోయి మాపై బురద జల్లుతున్నారని విమర్శించారు. ఫార్ములా వన్‌ బోట్‌ రేసింగ్‌ పోటీలపైనా జగన్‌ ఆరోపణలు చేస్తున్నారన్నారు. 2019 నాటికి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com