విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 300వ రోజు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగనుంది. జగన్ తన 300వ రోజు పాదయాత్రను కోటవానివలస నుంచి ప్రారంభించారు. పాదయాత్ర బంటువానివలస, అడ్డాపుశీల క్రాస్, బచి జంక్షన్, సీతారాంపురం క్రాస్, ఉల్లిభద్ర, గరుగుబిల్లి క్రాస్, కె.రామినాయుడువలస క్రాస్ మీదుగా తోటపల్లి రిజర్వాయర్ వరకు కొనసాగనుంది.