అమృత్సర్: పంజాబ్లో పేలుడు సంభవించింది. అమృత్సర్ జిల్లా రాజ్సన్సి గ్రామంలోని నిరంకారి భవన్ దగ్గర జరిగిన ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందగా.. మరో పది మంది గాయపడ్డారు. నిరంకారి తెగ జరుపుకుంటున్న ఉత్సవాలు లక్ష్యంగా ఈ పేలుడు జరిగింది. బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆ బిల్డింగ్లోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు ఈ పేలుడుపై విచారణ జరుపుతున్నారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వాళ్లను ఆసుపత్రికి తరలించినట్లు సీనియర్ పోలీస్ అధికారి సురీందర్ పాల్ సింగ్ వెల్లడించారు.