హైదరాబాద్: హైదరాబాద్-తిరుపతి స్పైస్జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. రేణిగుంటలో ల్యాండ్ కావాల్సిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. స్పైస్జెట్ విమానంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్, తదితరులు ఉన్నారు. నెల రోజుల వ్యవధిలో విమానంలో మూడోసారి సాంకేతిక లోపం ఏర్పడడం గమనార్హం.