ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తోటపల్లి ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం తీవ్ర నిర్లక్ష్యం :జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 17, 2018, 05:32 PM

వైకాపా అధినేత జగన్ పాదయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి అనంతరం ఆయన తొలి సారిగా బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. తోటపల్లి ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టులో మిగిని పది శాతం పనులను కూడా ఈ నాలుగేళ్లలో పూర్తి చేయలేదన్నారు. అలాగే ఝంజావతి ప్రాజెక్టుకు గురించి కూడా పట్టించుకోలేదని విమర్శించారు.


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సరిగ్గా ఎన్నికల సమయంలోనే ప్రాజెక్టులు గుర్తుకు వస్తాయని వైకాపా అధినేత జగన్ విమర్శించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడుతున్నారు. తోట్లపల్లి, జంఝావతి ప్రాజెక్టులు ఎంతవరకూ వచ్చాయని చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయని కనుకనే ఆయన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని అన్నారు. ఈ నాలుగున్నరేళ్లుగా ఈ సంగతి ఆయనకు ఎందుకు గుర్తురాలేదని జగర్ విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com