కాకినాడ: నిజమైన ప్రజా సంక్షేమ రాజ్యం స్థాపించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం పేరిట కాకినాడ బ్యాంక్ పేట వీధులలో కాంగ్రెస్ జెండాలతో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంగా పాలూరు గృహస్తులతో వారు మాట్లాడారు. అవినీతి రహిత పరిపాలనను అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిజమైన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు నూలు కుర్తి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకులు వెంకటరమణ, బోనం భాస్కర్, పంతం నెహ్రూ జవాన్ ఆలీ, ఫణీశ్వరరావు, వర్మ, కంభం రాజబాబు తదితరులు పాల్గొన్నారు.