ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చింతమనేనిపై చంద్రబాబు ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 17, 2018, 04:20 PM

అమరావతి: నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తాజాగా మరో వివాదంలో కెక్కిన చింతమనేనిపై సీఎం పద్దతి మార్చుకోకపోతే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ప్రభాకర్ పై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్ అని హెచ్చరించారు..ఎన్ని సార్లు చెబుతున్నా తీరు మారడం లేదన్నారు..పార్టీకి నష్టం వాటిల్లితే ఉరుకోనన్న చంద్రబాబు.. చింతమనేని వ్యవహారాన్ని పార్టీ సీనియర్లు సిఎం వద్ద ప్రస్తావిస్తూ.. ఒకరు చేసే తప్పులకు అంతా సమాధానం చెప్పుకోవాల్సి వాస్తదని వాపోయారు.


నియోజకవర్గంలోని పెదపాడు మండలం వేంపాడులో మాజీ సర్పంచ్‌ పై చింతమనేని చేయి చేసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. చింతమనేని డౌన్‌ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గ్రామంలోకి రావడానికి యత్నించిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకున్నారు.. చివరికి ఎమ్మెల్యేతో క్షమాపణ కూడా చెప్పించారు. ఇప్పుడు అది సీఎం దృష్టి వెళ్లడంతో ఆగ్రహానికి గురయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com