రాజమండ్రి: రాజమండ్రి ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద పోలీసులు 66 కేజీల గంజాయిని పట్టుకున్నారు. మొత్తం 6 సంచులలో 66 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ప్రకాష్ నగర్ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్ళినట్లుగా చెప్తున్నారు. గంజాయి అక్కడకి ఎలా వచ్చింది అనే అంశం మీద దర్యాప్తు చేస్తున్నామని.. దొరికిన గంజాయి విలువ దాదాపుగా ముప్పై లక్షలు ఉంటుందన్నారు.