సీబీఐ అంతర్గత కలహాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో సీబీఐ తమ రాష్ట్రంలో ఎటువంటి సోదాలు చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తన పర్మిషన్తోనే సీబీఐ సోదాలు చేయాలని బాబు అన్నారు. దీంతో ఏపీలో సీబీఐ ఆగడాలకు చెక్ పడింది. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సమర్థించారు. సీబీఐని తమ రాష్ట్రంలోకి అనుమతించమని బాబు తీసుకున్న నిర్ణయం సరైందే అని మమతా బెనర్జీ అన్నారు. ఓ సభలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కేవలం చరిత్రను మారుస్తున్నది, పేర్లు మారుస్తున్నది, నోట్లు మారుస్తున్నది, వ్యవస్థలను మారుస్తున్నదని కానీ అసలైన గేమ్ చేంజర్ కాదు అని దీదీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్ల దేశం ప్రమాదంలో పడిందన్నారు. ఈ దేశానికి జన్మనిచ్చింది తామే అన్న బిల్డప్ ఇస్తున్నారని, అసలు స్వాతంత్ర సమర సమయంలో బీజేపీ ఆనవాళ్లే లేవని మమతా బెనర్జీ అన్నారు.