మావోయిస్టుల దాడులను కూడా లెక్క చేయకుండా ప్రజలు పెద్దయెత్తున ఓట్లు వేయడానికి రావడం ప్రజాస్వామ్యంపై వారికి ఉన్న విశ్వాసానికి తార్కాణమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగించారు. బస్తర్ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడానికి వచ్చి ప్రజాస్వామ్యం శక్తి ఏమిటో నిరూపించారని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో ఇక్కడ కూర్చుని ఉన్న ఒక్కరిలోనూ బాధ కనిపించడం లేదని మోడీ అన్నారు.