అమరావతి : జయహో బీసీ ఐక్య వేదిక వేదిక పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విడుదల చేశారు. సీఎం తన నివాసం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జయహో బీసీ ఐక్య వేదిక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా బీసీ నేతలు తరలివచ్చారు.అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా ముఖ్యమన్నారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు నష్టపోకూడదన్నారు. పంపుసెట్లు మార్చి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చేస్తామన్నారు. మౌలిక సదుపాయాల కోసం రూ.48వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.