చెన్నై : తమిళనాడులో తుపాన్ కారణంగా 15 మంది మృతి చెందారని ముఖ్యమంత్రి పళనిస్వామి చెప్పారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయిల చొప్పున పరిహారం అందించనున్నామని ఆయన చెప్పారు. తుపాన్ ధాటికి 15 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని పళనిస్వామి అన్నారు. రెండు రోజుల్లో విద్యుత్ పునరుద్ధరణకు అన్ని చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు తీసుకుంటున్నామని, వీలైనంత త్వరగా సహజ స్థితి తీసుకువచ్చే పనిలో ఉన్నామని ఆయన అన్నారు.