చెన్నై : తమిళనాడులో గజ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. నాగపట్టణం, వేదారణ్యం మధ్య తుపాను తీరం దాటడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరి కొన్ని రైళ్లను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గజ తుపాను ధాటికి 20 మంది మృతి చెందారు. రామేశ్వరం - చెన్నై ఎక్స్ప్రెస్, తిరుచెందూర్ - చెన్నై ఎక్స్ప్రెస్ను తంజావూరు వద్ద, మైలదుతురాయి - తిరుచ్చి ప్యాసింజర్ను కుంభకోణం వద్ద నిలిపివేశారు. మైలదుతురాయి - తిరువూరు, తిరుచ్చి - మైలదుతురాయి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. రైల్వే ట్రాక్పై చెట్టు విరిగిపడడంతో తిరుచ్చి వద్ద 20 నిమిషాల పాటు తిరుచ్చి - ఈరోడ్ ప్యాసింజర్ను ఆపివేశారు. రైలు పట్టాలపై పడి ఉన్న చెట్టును తొలగించారు.