తిరువనంతపురం : శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం ద్వారాలను అధికారులు నేటి సాయంత్రం తెరవనున్నారు. ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం మూడవసారి ఆలయం ద్వారాలు తెరచుకోనున్నాయి. గతంలో ఇక్కడ చెలరేగిన ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని భారీ బందోబస్తు ఏర్పాట్లుచేశారు. గురువారం అర్థరాత్రినుంచే 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.