ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాచవరంలో అగ్ని ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 16, 2018, 09:18 AM

అంబాజీపేట : విద్యుత్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి మాచవరంలో 4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. మొల్లేటి సత్యనారాయణ ఇంటి నుండి మంటలు వెలువడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఇంటిలో సత్యనారాయణ కుటుంబంతోపాటు, మొల్లేటి పరశురాముడు, కె. గీతాజీ కుటుంబాలు కూడా ఇంటిలో నివాసముంటున్నాయి. పరశురాముడుకు చెందిన లక్ష రూపాయల నగదు అగ్నిప్రమాదంలో కాలిపోయింది. రెండు గ్యాస్ సిలిండర్లు అగ్నికి ఆహుతయ్యాయి. అవి ఎప్పుడు పేలుతాయోనని ప్రజలు పరుగు తీశారు. అమలాపురం అగ్నిమాపక అధికారి జానకీరామ్ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com