బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుఫాన్ ఈ మధ్యాహ్నం తీవ్ర తుఫాన్ గా మారింది. ఈరాత్రికి తమిళనాడు వద్ద తీరం దాటనుండగా దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే దీని ప్రభావంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవగా.. చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. రేపు ఉదయం వరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ ఇప్పటికే సూచించింది.