తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబ తెలివైన నేత అన్నారు. ఆయనకు ముందు చూపు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం మేలు కోసమే ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో కేంద్రం ఏపీకి చేసిందేమీ లేదని విమర్శించారు.