రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలోని రాజానగరంలో జనసేన నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ అవినీతిని బద్దలు కొట్టడానికి జనసేన పుట్టిందన్నారు. దేశంలో అవినీతి పెట్రేగి పోయిందని.. అవినీతి అనేది అలవాటుగా మారిపోయిందని.. అవినీతిని తరిమికొట్టి వచ్చే ఏడాది దీపావళి చేసుకుందామన్నారు. దోపిడీ చేసేవాళ్ళు దోపిడీ చేస్తూనే ఉన్నారని.. మనం ఎన్నాళ్ళు చూస్తూ ఉండిపోవాలని.. బద్దలు కొట్టి తీరాల్సిందేనన్నారు.గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జనసేన సహకారం లేకుంటే ప్రభుత్వాన్ని స్థాపించగలిగేదా? అని ప్రశ్నించారు. అప్పుడు మన సహకారం తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మనమీదే ఎక్కి తొక్కుతుంటే చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రుల కొడుకులైన జగన్, లోకేష్ లాంటి నాయకులు మనకు కావాలా? వద్దా? అని ప్రజలను ప్రశ్నించారు. నేను వెనకడుగు వేయమని మాట ఇస్తున్నామని.. మాట మారిస్తే చొక్కా పట్టుకొని నన్ను ప్రశ్నించండన్నారు. మార్పు కోసమే నేను రాజకీయాలలోకి వచ్చానని మార్చే వెళ్తానన్నారు.