ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుజలస్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్ 1 కు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 15, 2018, 06:32 PM

సీఎం చంద్రబాబు నాయుడు సుజలస్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్ 1 కు శంకుస్థాపన చేశారు. 2,200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖ జిల్లాలోని 9 మండలాలలో ముప్పై వేలఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం హేతుబద్దత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని.. ఎన్నికష్టాలు ఉన్నా ప్రజలు బాధ పడకూడదనే కష్టపడుతున్నామన్నారు. నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్ట్ ద్వారా నీటి కష్టాలను అధిగమిస్తామని.. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహాయం చేయడం లేదని అయినా మేనెల నాటికి పోలవరం పూర్తిచేసి విశాఖ ప్రతిఏకరానికి నీరందిస్తామన్నారు. ప్రాజెక్ట్ లకు భూములు కోల్పోయిన రైతులకు ఉదరంగా పరిహారం ఇచ్చామని.. వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేసి కష్టాలను అధిగమిస్తున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com