బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారింది. నాగపట్నానికి ఈశాన్యంగా 225 కిమీ దూరంలో కేంద్రీకృతమైన గజ తుఫాన్ ఇవాళ రాత్రి 8 -11 మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. పంబన్-కడలూరు మధ్య తుఫాన్ ఆ మారి తీరం దాటనుండగా తమిళనాడులోని నాగపట్నం, తిరువారూర్, తంజావూరు జిల్లాలతో పాటు ఏపీలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో మోస్తరుతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడు జిల్లాలకు 20 సెమీ వర్షపాతంతో పాటు 100 కిమీ వేగంతో గాలులు వేచి అవకాశం ఉండగా ఏపీలోని జిల్లాలకు మాత్రం వర్ష సూచనగా తెలిపింది.