జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో సెజ్ భూములను పరిశీలిస్తున్నారు. సెజ్ భూములను పరిశీలించేందుకు వచ్చిన జనసేనానికి స్థానిక మహిళలు హారతులు పట్టారు. సాయంత్రం రాజానగరంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు.