ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనకు కావలసింది పాతిక కేజీల బియ్యం కాదు పాతిక సంవత్సరాల భవిష్యత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 14, 2018, 07:39 PM

 అనపర్తి బహిరంగ సభలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. మాకు సంస్కారం ఉంది కనుకే అయన ఇంటి ఆడపడుచుల గురించి మాట్లాడడం లేదన్నారు. జగన్ నాన్న ముఖ్యమంత్రి అయినా మాకేం భయం లేదన్న పవన్ జగన్ ఒక్కడిని అంటే ఆయన సామాజిక వర్గం మొత్తాన్ని అన్నట్లు కాదని కేవలం ఆయనను అన్నట్లేనన్నారు.తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గొల్లమామిడాడలో బహిరంగ సభలో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలు రాష్ట్రంలో కులాల మధ్య గొడవలు పెడుతున్నారన్నారు. అందుకే జనసేన ఏడు సిద్ధాంతాలను ప్రవేశ పెడుతూ కులాల ఐక్యత అనే సిద్ధాంతం మీద పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్ర అవతరణ చేసిన పొట్టి శ్రీరాములును ఒక కులానికి అంకితం చేసారని.ప్రాణత్యాగం చేసిన వ్యక్తులను మర్చిపోతున్నారన్నారు.


మనకు కావలసింది పాతిక కేజీల బియ్యం కాదు పాతిక సంవత్సరాల భవిష్యత్తు, అది అందించేందుకు జనసేన పనిచేస్తుంది.16 నెలలు జైలులో ఉన్న జగన్ గారు ముఖ్యమంత్రి గా కావాలా, లేక రోజుకొక మాట మారుస్తూ ఒక రోజు మోదీ దేవుడు అని, ఒక రోజు మోదీ అన్యాయం చేసారు అని మాట్లాడే చంద్రబాబు గారు కావాలా, లేక ప్రజలకు అండగా నిలబడే నేను కావాలా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com