కృష్ణాజిల్లా నందిగామ మండలం రాఘవాపురం కొండపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. జి+3 ఇళ్ళ నిర్మాణంలో బాగంగా మట్టి తవ్వకాలలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణల నేపధ్యంలో విజిలెన్స్ యస్.పి అధ్వర్యంలో పరిశీలించారు. అక్రమ రవాణా జరిగిందని పిర్యాదులు రావటంపై విచారణ చేస్తున్నామన్న విజిలెన్స్ యస్.పి సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామన్నారు. గవర్నమెంటుకి చెల్లించాలసిన బకాయిలు చేలించారా లేదా అని కోణంలో కూడా విచారణ చేస్తున్నామంటున్న విజిలెన్స్ ప్రభుత్వం సమక్ర విచారణ కోరడంతో సర్వే చేస్తున్నామని.. పర్మిట్ లో కూడా అక్రమాలు జరిగాయంటూ పిర్యాదు రావటంపై కూడా విచారణ చేస్తున్నామన్నారు.