బెంగళూరు: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అనంత్ కుమార్ గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. క్యాన్సర్కు సంబంధించి చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందారు. 1959 సెప్టెంబర్ 22న అనంత్ కుమార్ బెంగళూరులో జన్మించారు. ఆయన వాజ్పేయ్ ప్రధాన మంత్రిగా పనిచేసినప్పుడు.. ఆయన మంత్రివర్గంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. అనంత్ కుమార్ ఆరు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 1996లో తొలిసారిగా లోక్సభకు ఆయన ఎన్నికయ్యారు. బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2014లో రెండు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు కెమికల్స్, ఫెర్టిలైజర్స్ను నిర్వర్తించారు. జులై 2016 నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.