నాగుల చవితి పర్వదినం పురస్కరించుకొని ఆదివారం తెల్లవారుజామున రెండు ముప్పై నిమిషాలకు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో నాగ పుట్ట వద్ద తొలి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ దంపతులు తొలి నాగ పూజ నిర్వహించారు. అనంతరం పుట్టలో పాలుపోశారు. ఈ కార్యక్రమంలో సభాపతి తనయుడు మండల రాజా , ఆలయ ఈవో శారద కుమారి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.