తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయాలా వద్దా అనే అంశంపై త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. విజయవాడలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తో పాటు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం జిల్లా నేతలు జనసేనలో చేరారు. ఈసందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని అనుకోలేదన్నారు. అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే 2019లో ఏప్రిల్ లో వస్తాయని అనుకున్నామన్నారు. ఆంధ్రా వివక్షకు గురైంది కాబట్టి ముందు ఇక్కడంతా తిరిగి తర్వాత అక్కడికి వెళ్లాలనుకున్నామన్నారు. అయితే ఈలోగా ముందస్తు వచ్చిందన్నారు. 23 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అనుకున్నామన్నారు. అయితే ఇలా ముందస్తు రావడంతో డోలాయమానంలో పడ్డామన్నారు.