హైదరాబాద్: జనసేన అధినేత పవన్కల్యాణ్ గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. రాజ్భవన్కు చేరుకున్న ఆయన.. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను నష్టంపై తమ పార్టీ రూపొందించిన నివేదికను గవర్నర్కు అందజేశారు. తుపాను బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ను పవన్ కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తుపాను ధాటికి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం తీవ్రంగా నష్టపోయిందని.. అక్కడ గతంలో ఉన్న పరిస్థితి రావాలంటే కనీసం 15-20 ఏళ్లు పడుతుందని చెప్పారు. కేరళలో వరదలు వచ్చినప్పడు నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయం బయట ప్రపంచానికి తెలిసిందని, ఉద్దానంలో నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నా పూర్తిస్థాయిలో అది బయటకు చూపించలేదనే ఆవేదన అక్కడి ప్రజల్లో ఉందని పవన్ తెలిపారు. ప్రజల్లో ఉన్న స్పందననే నివేదిక రూపంలో గవర్నర్కు అందజేశామన్నారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల సంతోషంగా ఉన్నామని, ఏపీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను గౌరవించి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు.