విజయనగరం : మంత్రి సుజారు విజయనగరంలో సిరిమాను సంబరాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సుజాయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ.. ఈ ఏడాది విజయనగరం ఉత్సవాలు ఘనంగా జరిగాయన్నారు. పైడిమాంబ సిరిమాను సంబరం కూడా సజావుగా సాగుతోందని తెలిపారు. విజయనగరం పైడితల్లమ్మ పండగని రాష్ట్ర పండుగగా చేయాలని ఈ రోజు సిఎం కి వినతిపత్రాన్ని ఇచ్చామన్నారు. సిఎం కూడా సానుకూలంగా స్పందించి..గుర్తిస్తామని హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రూ.2 కోట్లు నిధులు కూడా విడుదల చేస్తామని హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. సిఎం హామీతో వచ్చే ఏడాది ఈ పండుగల్ని ఇంకా ఘనంగా నిర్వహిస్తామన్నారు. పైడితల్లి పండగ రాష్ట్ర పండుగ కావాలన్నదే ఇక్కడి ప్రజల చిరకాల వాంఛని, సిఎం హామీతో అది నేరవేరుతుందని పేర్కొన్నారు.