న్యూఢిల్లి : భగవంతుడిని పూజించే హక్కు తనకు ఉన్నప్పటికీ, అపవిత్రం చేసే హక్కు తనకు లేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. శబరిమల వివాదంపై స్మృతి ఇరానీ స్పందించారు. బహిష్టు స్రావంతో తడిసిన నేప్కిన్తో స్నేహితుడి ఇంట్లోకి వెళ్లగలమా? అని ఆమె ప్రశ్నించారు. స్నేహితుడి ఇంట్లోకే వెళ్లలేనప్పుడు దేవుడి ఇంట్లోకి ఎలా వెళ్లగలుగుతామని ఆమె ప్రశ్నించారు.