అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు పర్యవేక్షణలో మహా పూర్ణాహుతి నిర్వహించారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ భానుగుడి సెంటర్లో రిజర్వు లైన్ అయ్యప్ప స్వామి ఆలయంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా శుక్రవారం మహాపూర్ణాహుతి నిర్వహించ్చారు . ఈ సందర్భంగా అమ్మవారి సప్తశతీ 700 శ్లోకాలు చదువుతూ అగ్నిగుండంలో ఆవునెయ్యి , పాయసం , అన్నిరకాల పండ్లను హోమంలో చేశారు . ఈ హామాన్ని చేయడం వలన కలిగే మహత్యాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు భక్తులకు వివరించారు . ఈ కార్యక్రమంలో గోపాలకృష్ణ మాస్టారు చాగంటి కోటేశ్వరరావు ,సుబ్రహ్మణ్య శర్మ , చాగంటి శిష్య బృందం అధిక సంఖ్యలో దంపతులు , మహిళలు , ఉన్నారు