నెల్లూరు వెంకటేశ్వర పురంలో లారీ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. నార్త్ ట్రాఫిక్ ఎఎస్సై వివి.రమణారావు వివరాల మేరకు.. స్థానిక కొయ్యల మిల్లులో వాచ్మెన్గా పని చేస్తున్న వెంకటేశ్వర్లు (65), నిన్న (గురువారం) రాత్రి ఫ్లైఓవర్ పిట్టగోడ వద్ద మూత్ర విసర్జన చేస్తుండగా.. అదే సమయంలో కృష్ణపట్నం పోర్టు నుంచి బొగ్గు లోడుతో బళ్లారి వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఫ్లైఓవర్ పిట్టగోడను ఢీకొంది. పిట్టగోడ దిమ్మెలు విరిగి పడటంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.