శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయనకు ఢిల్లీ నుంచి మరోసారి పిలుపు వచ్చింది. హస్తిన పర్యటనలో భాగంగా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమవుతారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆయన కలుసుకుంటారని సమాచారం. పరిపూర్ణానందకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల ప్రచార సారధిగా ఆయన్ను నియమించే అవకాశాలున్నాయని సమాచారం. పది రోజుల క్రితం అమిత్ షాతో పరిపూర్ణానంద న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. తాజా పరిస్థితులపై చర్చించారు. తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్ధిగా పరిపూర్ణానందను ప్రకటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. తన ఆసక్తి ప్రధానం కాదని, అమిత్ షా ఆలోచనలు, నిర్ణయాలు, అభిప్రాయాల ప్రకారం ప్రచార కార్యక్రమాలుంటాయని చెప్పారు. శరన్నవరాత్రుల తర్వాత మళ్లీ కలుద్దామని అమిత్ షా చెప్పడంతో పరిపూర్ణానంద మళ్లీ హస్తినకు వెళ్తున్నారు.