తిరుమల: తిరుమల శ్రీవారి కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కంపార్టుమెంట్లు నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. దీంతో శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం, టైంస్లాట్ సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నేడు తిరుమలలో పార్వేటి ఉత్సవం ఉంది. సుప్రభాతం మినహా అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.