ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిత్లీ బాధితులకు హెరిటేజ్ విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 19, 2018, 09:55 AM

భయంకర తిత్లీ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడానికి హెరిటేజ్ సంస్థ ముందుకొచ్చింది. హెరిటేజ్ ఫుడ్స్, హెరిటేజ్ ఉద్యోగుల తరఫున మొత్తం రూ.66,16,971లను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు. ఈ మేరకు హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా బ్రాహ్మణి స్వయంగా చెక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేశారు. 


శ్రీకాకుళం జిల్లా పలాసలో తిత్లీ బాధితులతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రులు దసరా వేడుకలు జరుపుకున్నారు. తిత్లీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మరోసారి చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ వేడుకల్లో పాల్గొన్న నారా బ్రాహ్మణి.. హెరిటేజ్ సంస్థ, ఉద్యోగుల తరఫున చెక్‌ను చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తుఫాన్ సంభవించిన మొదటి రోజు నుంచి హెరిటేజ్ ఉద్యోగులు బాధితులకు అండగా నిలవడం తనకెంతో గర్వకారణమని అన్నారు. 


హెరిటేజ్ ఉద్యోగుల సంక్షేమ నిధి నుంచి రూ.17,66,971 విరాళం ఇచ్చారని, దీనికి హెరిటేజ్ సంస్థ రూ.48,50,000 జతచేసి మొత్తంగా రూ.66,16,971ల విరాళాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ రూ.66 లక్షల విరాళాన్ని ఏపీ స్మార్ట్ విలేజ్ ప్రోగ్రామ్‌కు అందజేస్తామన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడతామని బ్రాహ్మణి వెల్లడించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com