శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో 'సేవ్ శబరిమల' ఉద్యమం జరుపుతున్న పలువురు భక్తులు మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. కాగా, సుప్రీం తీర్పును అనుసరించి ఆలయ దర్శనానికి వస్తున్న మహిళలను ఆందోళనకారులు, నీలక్కల్ వద్ద అడ్డుకుంటున్నారు. సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కొంత సమయం పడుతుందని ఆలయబోర్డు తెలిపింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, పండల రాజ కుటుంబం, ఆలయ ప్రధాన పూజారి, అయ్యప్ప సేవాసంఘ సభ్యులు ప్రత్యేక సమావేశంలో మహిళల ప్రవేశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే