కర్నూలు జిల్లాలోని ఆలూరు వద్ద ఇవాళ ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆరుగురు చనిపోగా, మరింత మందికి గాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదంపై మంత్రి కింజరాప్ అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తగు వైద్య సహాయం అందించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు.