శబరిమల : శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం తలుపులు రేపు తెరచుకోనున్నాయి. రేపటినుంచి భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులు స్వామి దర్శనార్థం పంపా జిల్లాకు చేరుకుంటున్నారు. కాగా మహిళలను ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను తాము గౌరవిస్తామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేరళ వాసులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్వామి దర్శనార్థం వచ్చిన మహిళలను స్థానిక మహిళలే నిలువరిస్తున్నారని, మగవారు కాదని ఆరెస్సెస్ మద్దతుదారు దేశ్ రతన్ నిగమ్ చెప్పారు.